ప్రశాంతంగా పురపాలక ఎన్నికల కౌంటింగ్.....
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి -13(తెలంగాణ ముచ్చట్లు)
జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపల్ కౌంటింగ్ సెంటర్ లో గురువారం కౌంటింగ్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుండి అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి 5 మునిసిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి, ఏదులాపురం, వైరా, కల్లూరులో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 2 రౌండ్ ల చొప్పున కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి ఫలితాలు ప్రకటించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments