కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు

ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డిజిపి శ్రీధర్, జోనల్ కమిషనర్ గంగ్వార్

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు

కీసర, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

ఈనెల 13 నుంచి 18 వరకునిర్వహించనున్న కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాల నిర్వహణపై డిజిపి శ్రీధర్, జోనల్ కమిషనర్ గంగ్వార్ బుధవారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు స్వామివారి దర్శనం సాఫీగా జరిగేలా ప్రత్యేక క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు పార్కింగ్ స్థలాలను గుర్తించి వాహనాల రాకపోకలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈసారి వాహనాలకు ఎలాంటి వీఐపీ పాస్‌లు జారీ చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అందరికీ సమాన అవకాశంతో దర్శనం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.భక్తులకు తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.ఈ పరిశీలనలో ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 
వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) : వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన...
నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు
ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం