కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, కార్యనిర్వాహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి కలిసి ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ అధికారులు సీఎంకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు