నాచారం–హెచ్ఎంటి నగర్ అభివృద్ధికి రూ.4.66 కోట్ల పనులకు శంకుస్థాపన

నాచారం–హెచ్ఎంటి నగర్ అభివృద్ధికి రూ.4.66 కోట్ల పనులకు శంకుస్థాపన

నాచారం, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లో రూ.4 కోట్ల 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాచారం డివిజన్‌తో పాటు హెచ్ఎంటి నగర్ డివిజన్‌ను కూడా సమానంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా హెచ్ఎంటి నగర్‌లో రూ.70 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా పెద్ద చెరువును రూ.30 కోట్ల రూపాయలతో సుందరీకరించనున్నట్లు ఆయన ప్రకటించారు.పెద్ద చెరువు సుందరీకరణతో నాచారం ప్రాంతంలో దోమల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.IMG-20260209-WA0110ఈ కార్యక్రమంలో ఏఈ సూరజ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్, నాచారం పరిధిలోని వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, బారాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం
స్టేషన్ ఘనపూర్,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు): స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 1, 9, 18 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న చింత...
వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే నా లక్ష్యం
7, 25 వార్డుల అభివృద్ధికి కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను గెలిపించాలి 
విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం
గంగిరెద్దుల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం