చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

హన్మకొండ,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):

రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమని పేర్కొంటూ, చిన్నారిపై అమానుష నేరానికి పాల్పడిన శ్రీకాంత్, గణేష్‌లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.

బాధిత చిన్నారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సమాజంలో భద్రతా వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని డా. కడియం కావ్య స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం
స్టేషన్ ఘనపూర్,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు): స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 1, 9, 18 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న చింత...
వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే నా లక్ష్యం
7, 25 వార్డుల అభివృద్ధికి కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను గెలిపించాలి 
విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం
గంగిరెద్దుల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం