త్రివేణి స్కూల్లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.
ముఖ్య అతిథిగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీనివాస్ రావు హాజరు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని త్రివేణి స్కూల్లో 16వ ఫన్ ఫెస్ట్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ వై. యార్లగడ్డ వెంకటేశ్వరరావు హాజరుకాగా, సత్తుపల్లి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సరిత, క్యాంపస్ ఇన్చార్జ్ వంశీ, కిడ్స్ ఇన్చార్జ్ పద్మ, అకాడమిక్ ఇన్చార్జ్ పవన్ పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఫన్ ఫెస్ట్లో భాగంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి ప్రతిభను చూసి హాజరైనవారు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం. శ్రీనివాస్ రావు విద్యార్థుల ప్రదర్శనలను ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అలాగే పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొని వేడుకలను మరింత శోభాయమానంగా మార్చారు. ఈ వేడుకలను విద్యార్థులు ఆనందోత్సాహాలతో, హర్షాతిరేకాలతో జరుపుకోవడం విశేషం.



Comments