వనపర్తి 28వ వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల శిరీష రవికి గెలిపించండి
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి7(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలోని 28వ వార్డు అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల శిరీష రవి ని గెలిపించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా 28వ వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం, పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొంటూ, వనపర్తి మున్సిపల్ పరిధి అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి కోట్ల శిరీష రవి ని కౌన్సిలర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, 28వ వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments