నాచారం డివిజన్లో భూగర్భ డ్రైనేజీ పనుల ప్రారంభం
నాచారం, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రూ.40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్తో కలిసి ప్రారంభించారు.
భవాని నగర్ రోడ్ నెంబర్–1లో, వి.ఎస్.టి కాలనీలో టెంపుల్ ఎదురుగా ఉన్న రెండు లైన్లలో, అలాగే ఎర్రగుంట ప్రాంతంలోని లాల్ బహుదూర్ శాస్త్రి సామాజిక భవనం రోడ్డులో ఈ భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా వర్షాకాలంలో ఏర్పడే నీటి నిల్వలు, పారిశుధ్య సమస్యలు పరిష్కారమై ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించబడుతుందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సిరాజ్, భవాని నగర్–వి.ఎస్.టి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బారాసా నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎర్రగుంటవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


Comments