విశ్వ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణ స్థల పరిశీలన

_నాగారం గ్రామంలోని సర్వే నం.574న స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

విశ్వ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణ స్థల పరిశీలన

మేడ్చల్ – మల్కాజ్గిరి , ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని నాగారం గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 574లో ఉన్న స్థలాన్ని కీసర తహాసీల్దారు యాదగిరి రెడ్డితో కలిసి అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. భవన నిర్మాణానికి సంబంధించిన భూమి స్థితిగతులు, హద్దులు, ప్రభుత్వ నిబంధనల అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సర్వేయర్ వినయ్ కుమార్, ఆర్ఐ విశ్వనాథ్ పాల్గొన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలోని ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏర్పాటు చేసిన ఏదులాపురం మునిసిపాలిటీ...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ 
మున్సిపల్ ఎన్నికలు: ఫిబ్రవరి 11న స్థానిక సెలవు
నేడు..కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోగుల ఆది 
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. 
సత్తుపల్లి 14వ వార్డులో ప్రజల మనిషిగా కూసంపూడి మహేష్.