సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం
Views: 4
On
నాచారం, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేదల జీవితాల్లో ఆశాజ్యోతిగా నిలుస్తోంది. నాచారం డివిజన్ వీఎస్టీ కాలనీకి చెందిన మహమ్మద్ షాహిన్ అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు భారీ ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉపశమనం లభించింది.ఈ విషయాన్ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.1 లక్ష 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు.మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదలు, బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Feb 2026 20:12:58
కుషాయిగూడ, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్...


Comments