మల్లాపూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం

నాగలక్ష్మి నగర్, ఎస్‌వీ నగర్ కాలనీల్లో ప్రజా సమస్యల పరిశీలన

మల్లాపూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం

మల్లాపూర్, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాగలక్ష్మి నగర్ కాలనీ మరియు ఎస్‌వీ నగర్ కాలనీల్లో కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో “బస్తీబాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరాలో లోపాలు, వీధి దీపాల మరమ్మత్తులకు సంబంధించిన సమస్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.కాలనీవాసులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్న నెమలి అనిల్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం తమ లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ,“ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత నాది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైసర్ చిగుళ్ల మల్లేష్, ప్రెసిడెంట్ తోట నవీన్ గౌడ్, జనరల్ సెక్రటరీ IMG-20260204-WA0045సింగారి కిశోర్ కుమార్, ఎస్‌వీ నగర్ కాలనీ సభ్యులు శంకర్, యాదగిరి, అనిల్, నర్సింహ, మహేష్, సాయి పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు వి. శ్రీనివాస్, కోయలకొండ రాజేష్, దాసరి సాయి, కృష్ణ తదితరులు హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.