మల్లాపూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం

నాగలక్ష్మి నగర్, ఎస్‌వీ నగర్ కాలనీల్లో ప్రజా సమస్యల పరిశీలన

మల్లాపూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం

మల్లాపూర్, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాగలక్ష్మి నగర్ కాలనీ మరియు ఎస్‌వీ నగర్ కాలనీల్లో కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో “బస్తీబాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరాలో లోపాలు, వీధి దీపాల మరమ్మత్తులకు సంబంధించిన సమస్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.కాలనీవాసులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్న నెమలి అనిల్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం తమ లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ,“ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత నాది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైసర్ చిగుళ్ల మల్లేష్, ప్రెసిడెంట్ తోట నవీన్ గౌడ్, జనరల్ సెక్రటరీ IMG-20260204-WA0045సింగారి కిశోర్ కుమార్, ఎస్‌వీ నగర్ కాలనీ సభ్యులు శంకర్, యాదగిరి, అనిల్, నర్సింహ, మహేష్, సాయి పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు వి. శ్రీనివాస్, కోయలకొండ రాజేష్, దాసరి సాయి, కృష్ణ తదితరులు హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .