బీసీ వసతి గృహాల్లో సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు
మెడ్చల్–మల్కాజ్గిరి, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మరియు మెడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులతో సామాజిక న్యాయంపై ప్రతిజ్ఞ చేయించగా, అనంతరం వ్యాసరచన పోటీలు మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు సామాజిక అసమానతలు, న్యాయం, సమాన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధికారులు అభినందించి బహుమతులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు
. భవిష్యత్లో కూడా ఈ తరహా అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.


Comments