బీసీ వసతి గృహాల్లో సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు

బీసీ వసతి గృహాల్లో సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు

మెడ్చల్–మల్కాజ్‌గిరి, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ మరియు మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులతో సామాజిక న్యాయంపై ప్రతిజ్ఞ చేయించగా, అనంతరం వ్యాసరచన పోటీలు మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు సామాజిక అసమానతలు, న్యాయం, సమాన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధికారులు అభినందించి బహుమతులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెరుగుతాయని వారు పేర్కొన్నారుIMG-20260204-WA0047. భవిష్యత్‌లో కూడా ఈ తరహా అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.