కేసీఆర్పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన.
నేడు కల్లూరులో శాంతియుత కార్యక్రమం.
సత్తుపల్లి, ఫిబ్రవరి 31 (తెలంగాణ ముచ్చట్లు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా నేడు (ఆదివారం) కల్లూరులో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ పిలుపు మేరకు ఉదయం 10 గంటలకు కల్లూరు పట్టణంలోని మెయిన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగనుంది.
ఈ నిరసనకు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ అధినేతపై రాజకీయ కక్షసాధింపుతో చర్యలు చేపడుతున్నారని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కల్లూరు పట్టణం, మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల నాయకులు, తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు తెలిపారు.


Comments