నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి కాలనీల్లో కార్పొరేటర్ పర్యటన

నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి కాలనీల్లో కార్పొరేటర్ పర్యటన

నాచారం, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్‌లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ మున్సిపల్ అధికారులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న రోడ్ల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన చోట్ల వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, ఏఈ స్పందన, వర్క్ ఇన్స్పెక్టర్ చారి పాల్గొన్నారు. అలాగే కాలనీ నాయకులు నరసింహా, ప్రసాద్ శేఖర్ గౌడ్‌తో పాటు స్థానికులు పాల్గొని తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, కాలనీల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .