1962 పశు సంచార వాహన సిబ్బందికి అభినందనలు.!

డిస్టోషియా సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గొర్రెకు సకాలంలో వైద్యం.

1962 పశు సంచార వాహన సిబ్బందికి అభినందనలు.!

సత్తుపల్లి, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):

కల్లూరు మండలం పడమటి లోకారం గ్రామంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గొర్రెకు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన 1962 పశు సంచార వాహన సిబ్బంది సకాలంలో వైద్యం అందించి ప్రాణం కాపాడారు. పడమటి లోకారం గ్రామానికి చెందిన రైతు పర్వత వీరభద్రరావుకు చెందిన గొర్రెకు డిస్టోషియా (కడుపులో శిశువు మృతి చెంది ఉబ్బిపోవడం) సమస్య తలెత్తింది. రెండు రోజుల క్రితం గొర్రె బురదలో కూరుకుపోవడంతో కడుపులోని శిశువు చనిపోయి, గొర్రె నడవలేని స్థితికి చేరుకుంది.
ఈ విషయమై సమాచారం అందుకున్న సత్తుపల్లి పశు సంచార (1962) వాహన సిబ్బంది పేరా వెట్ మల్లెల్ల జగదీష్, కెప్టెన్ (డ్రైవర్) మహాకవి, వైద్య సహాయకుడు షేక్ సుభాని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికక్కడే అత్యవసర వైద్యం అందించి, కడుపులో మృతి చెందిన శిశువును సురక్షితంగా బయటకు తీసి గొర్రె ప్రాణాన్ని కాపాడారు.
సకాలంలో స్పందించి మూగజీవ ప్రాణం కాపాడిన పశు సంచార వాహన సిబ్బందిని పడమటి లోకారం గ్రామస్తులు, రైతు పర్వత వీరభద్రరావు అభినందించారు. అలాగే ఖమ్మం జిల్లా పశు సంచార (1962) వాహనాల మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాల పశుసంచార (1962) వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ కూడా సిబ్బందిని అభినందించారు.IMG-20260119-WA0025

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!