వనపర్తి పట్టణంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి పట్టణంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తిజనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని మారెమ్మకుంట కూడలి, గాంధీచౌక్ ఉర్దూ మీడియం పాఠశాల కూడలిలో రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పట్టణంలోని ప్రజలకు భద్రతతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో రాత్రి వేళల్లో వెలుతురు సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు.ఈ లైట్ల ఏర్పాటు వల్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్య తీరిపోయిందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అధికారులు,ప్రజాప్రతినిధులను కోరినా సమస్య పరిష్కారం కాలేదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు