కాజీపేట రైల్వే స్టేడియంలో మేడారం బస్ లు ప్రారంభం 

కాజీపేట రైల్వే స్టేడియంలో మేడారం బస్ లు ప్రారంభం 
మేడారం బస్సు ను జెండా ఊపి ప్రారంభిస్తున్న సిఐ సుధాకర్ రెడ్డి

 కాజీపేట్ జనవరి 25 తెలంగాణ ముచ్చట్లు 

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర అయినటువంటి మేడారం  సమ్మక్క- సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుండి కాజీపేట రైల్వే జంక్షన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు కాజీపేట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం టీజేఎస్ ఆర్టిసి వరంగల్ - 2 డిపో వారిచే కాజీపేట జంక్షన్ ముందు నున్న రైల్వే స్టేడియంలో ఆదివారం బస్ ప్రాంగణాన్ని  ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులను ఆపరేట్ చేసే ఇటువంటి క్యాంపును డిపో మేనేజర్ ఎం రవిచంద్ర అధ్యక్షతన కాజీపేట సీఐ ఎం సుధాకర్ రెడ్డి, ఎస్సై నవీన్ కుమార్ కాజీపేట రైల్వే స్టేడియం ఇన్చార్జ్ ఎస్సీ రైల్వే జర్నల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవిచందర్ మాట్లాడుతూ ఇట్టి అవకాశాన్ని కాజీపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు లతోపాటు రైల్వే స్పెషల్ రైళ్లు వేసిన కారణంగా హనుమకొండ బస్టాండ్ వెళ్లకుండా రైలు ప్రయాణికులు కాజీపేట జంక్షన్ సమీపంలోని రైల్వే స్టేడియంలో బస్ ప్రాంగణం లో 24 గంటల ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్న మనీ ఆయన అన్నారు. బస్సు ప్రాంగణం ద్వారా సునాయాస ప్రయాణం చేసి మేడారం చేరుకోగలరని ఆయన కోరారు. కాజీపేట్ నుండి మేడారం వరకు ఫుల్ టికెట్  రూ 250  హాఫ్ టికెట్  రూ 150  మహిళలకు ఉచితంగా రవాణా ను నిర్ణయించడం జరిగిందని, మంచినీరు, మెడికల్ క్యాంపు , క్యూ లైన్, మూత్రశాలలను  ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ట్రెజరర్ జి రాజేశ్వరరావు కమిటీ సభ్యులు ధరావత్ రఘు తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు టి జి ఎస్ ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ భవాని టీజీ బైరి రవీందర్ క్యాంప్ ఇన్చార్జిలు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .