బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనారిటీల ఐక్యతతో రాజ్యాధికారం సాధ్యం

వరంగల్ ఆవిర్భావ సభలో బానోత్ సునీల్ నాయక్ వ్యాఖ్యలు

బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనారిటీల ఐక్యతతో రాజ్యాధికారం సాధ్యం

వరంగల్,జనవరి 24(తెలంగాణ ముచ్చట్లు):

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అన్నీ ఐక్యంగా ముందుకు సాగితే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం సాధించడం సాధ్యమని ఎల్‌హెచ్‌పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ సునీల్ నాయక్ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ విశారదన్ నాయకత్వంలో ఏర్పడిన జేఏసీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని, ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సామాజిక న్యాయం లక్ష్యంగా జేఏసీ పనిచేస్తుందని చెప్పారు.
2029లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఏసీ పోటీ చేయనున్నట్లు, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఎల్‌హెచ్‌పీఎస్ నంగరభేరి ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని బానోత్ సునీల్ నాయక్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు