ప్రజల సమస్యలపై మీడియా నిరంతరం పోరాటం చేయాలి

తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో మాజీ జడ్పిటిసి

ప్రజల సమస్యలపై మీడియా నిరంతరం పోరాటం చేయాలి

పెద్దమందడి,జనవరి14(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్‌ను మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి బుధవారం వెల్టూర్ గ్రామంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పనిచేస్తోందని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజల సమస్యలను పాలకులకు తెలియజేసే కీలక పాత్రను పోషిస్తోందని తెలిపారు. నిజ నిర్భయమైన వార్తలతో ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికలే సమాజంలో నిలదొక్కుకుంటాయని అభిప్రాయపడ్డారు.తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, గ్రామీణ ప్రాంతాల అంశాలను నిరంతరం ప్రచురిస్తూ మంచి గుర్తింపు పొందిందని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో  మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ దండు అశోక్, మాజీ సర్పంచ్ బాలు చంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ లు మల్లికార్జున్, నాగమణి నరేష్, రఘువర్ధన్ రెడ్డి, మల్లక్ సురేష్, మహేష్ రెడ్డి, దయ్యాల నాగన్న, లాల్, జర్నలిస్టులు బండి రాజు, రాజశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .