ఉప్పల్ జోనల్ కార్యాలయంలో కమిషనర్‌గా రాధికా గుప్తా

ఐఏఎస్ బాధ్యతల స్వీకరణ

ఉప్పల్ జోనల్ కార్యాలయంలో కమిషనర్‌గా రాధికా గుప్తా

ఉప్పల్, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ జోనల్ కార్యాలయంలో నూతన జోనల్ కమిషనర్‌గా  రాధికా గుప్తా ఐఏఎస్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల్,కాప్రా, బోడుప్పల్, నాచారం, ఘట్కేసర్, నాగారం,  సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాధికా గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఉప్పల్ జోన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .