ఉప్పల్ జోనల్ కార్యాలయంలో కమిషనర్‌గా రాధికా గుప్తా

ఐఏఎస్ బాధ్యతల స్వీకరణ

ఉప్పల్ జోనల్ కార్యాలయంలో కమిషనర్‌గా రాధికా గుప్తా

ఉప్పల్, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ జోనల్ కార్యాలయంలో నూతన జోనల్ కమిషనర్‌గా  రాధికా గుప్తా ఐఏఎస్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల్,కాప్రా, బోడుప్పల్, నాచారం, ఘట్కేసర్, నాగారం,  సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాధికా గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఉప్పల్ జోన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్