కరుణాలయానికి 50 కేజీల బియ్యం విరాళంగా అందజేసిన రిపోర్టర్ అనిల్ రాజ్

కరుణాలయానికి 50 కేజీల బియ్యం విరాళంగా అందజేసిన రిపోర్టర్ అనిల్ రాజ్

ధర్మసాగర్,డిసెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

క్రిస్మస్ పండుగ సందర్భంగా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని కరుణాలయంలో అనాధ పిల్లలకు సహాయం అందించారు. రిపోర్టర్ అనిల్ రాజ్ తన తాత గొల్లపల్లి రాజయ్య, నానమ్మ వెంకటమ్మల జ్ఞాపకార్థంగా 50 కేజీల బియ్యాన్ని కరుణాలయానికి విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి కరుణాపురం గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా-ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనాధ పిల్లల సంక్షేమానికి ఇటువంటి సేవలు మరింత విస్తరించాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నారాయణ, ఎం.డి. శంషుద్దీన్, చిట్యాల రమేష్, కందుకూరి అజయ్ చందర్, కందుకూరి ప్రభాకర్, ఎం.డి. నశిరోద్దీన్, ఫా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవాభావంతో ముందుకు వచ్చిన అనిల్ రాజ్‌ను పలువురు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .