కరుణాలయానికి 50 కేజీల బియ్యం విరాళంగా అందజేసిన రిపోర్టర్ అనిల్ రాజ్

కరుణాలయానికి 50 కేజీల బియ్యం విరాళంగా అందజేసిన రిపోర్టర్ అనిల్ రాజ్

ధర్మసాగర్,డిసెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

క్రిస్మస్ పండుగ సందర్భంగా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని కరుణాలయంలో అనాధ పిల్లలకు సహాయం అందించారు. రిపోర్టర్ అనిల్ రాజ్ తన తాత గొల్లపల్లి రాజయ్య, నానమ్మ వెంకటమ్మల జ్ఞాపకార్థంగా 50 కేజీల బియ్యాన్ని కరుణాలయానికి విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి కరుణాపురం గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా-ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనాధ పిల్లల సంక్షేమానికి ఇటువంటి సేవలు మరింత విస్తరించాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నారాయణ, ఎం.డి. శంషుద్దీన్, చిట్యాల రమేష్, కందుకూరి అజయ్ చందర్, కందుకూరి ప్రభాకర్, ఎం.డి. నశిరోద్దీన్, ఫా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవాభావంతో ముందుకు వచ్చిన అనిల్ రాజ్‌ను పలువురు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్