ప్రజల వద్దకే పాలన

ప్రజల వద్దకే పాలన

శాలపల్లి గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సర్పంచ్, ఉపసర్పంచ్

వేలేరు 24 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు నాయకులుగా కాకుండా సేవకులుగా ప్రజల వద్దకే వెళ్లి పాలన సాగిస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్, ఉపసర్పంచ్ ఎర్రగొల్ల రమేష్ ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటున్నారు.

గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, రోజువారీ అవసరాలకు సంబంధించిన సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, సాధ్యమైన పరిష్కారాల కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి పారదర్శకంగా పాలన అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను స్వయంగా వింటున్న సర్పంచ్, ఉపసర్పంచ్‌ల విధానంపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది గ్రామాభివృద్ధికి మంచి ఆరంభమని అభిప్రాయపడుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్