ప్రజల వద్దకే పాలన

ప్రజల వద్దకే పాలన

శాలపల్లి గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సర్పంచ్, ఉపసర్పంచ్

వేలేరు 24 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు నాయకులుగా కాకుండా సేవకులుగా ప్రజల వద్దకే వెళ్లి పాలన సాగిస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్, ఉపసర్పంచ్ ఎర్రగొల్ల రమేష్ ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటున్నారు.

గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, రోజువారీ అవసరాలకు సంబంధించిన సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, సాధ్యమైన పరిష్కారాల కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి పారదర్శకంగా పాలన అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను స్వయంగా వింటున్న సర్పంచ్, ఉపసర్పంచ్‌ల విధానంపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది గ్రామాభివృద్ధికి మంచి ఆరంభమని అభిప్రాయపడుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .