నాచారం రాఘవేంద్ర నగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌కు కాలనీవాసుల కృతజ్ఞతలు

నాచారం రాఘవేంద్ర నగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు

నాచారం, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం రాఘవేంద్ర నగర్‌ లోని జాన్సన్ గ్రామర్ స్కూల్ (కాంచన గ్రామర్ స్కూల్) వద్ద రోడ్డు నిర్మించాలని గత కొద్ది రోజులుగా కాలనీవాసులు నాచారం డివిజన్ కార్పొరేటర్‌ను వినతి పత్రాల ద్వారా కోరారు. వారి విజ్ఞప్తులకు స్పందించిన కార్పొరేటర్  శాంతి సాయిజెన్ శేఖర్ రూ.34 లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలనీవాసులు కార్పొరేటర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.కార్పొరేటర్ మాట్లాడుతూ ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షపు నీరు నిలవకుండా సరైన డ్రైనేజీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముత్యం రెడ్డి, రాంబాబు, నూనె ప్రకాష్, సిహెచ్. రమేష్, ఎండి. హఫీజుద్దీన్, షేక్ మహమూద్, మహమ్మద్ జహంగీర్, రాజేందర్, రామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్