ఉత్తమ ఇంటీరియర్ డిజైన్ అవార్డు అందుకున్న పద్మజ సింగ్

ఉత్తమ ఇంటీరియర్ డిజైన్ అవార్డు అందుకున్న పద్మజ సింగ్

హైదరాబాద్, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

హైటెక్ సిటీ నోవోటల్ హోటల్‌లో హైబీజ్ టీవీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉత్తమ పారిశ్రామికవేత్తల అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఉత్తమ ఇంటీరియర్ డిజైనర్ విభాగంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ది లోటస్ స్టూడియో అధినేత్రి పద్మజ సింగ్ ఉత్తమ ఇంటీరియర్ డిజైన్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును హైబిజ్ టీవీ అధినేత రాజగోపాల్ రెడ్డి ఆమెకు అందజేశారు.గత 22 సంవత్సరాలుగా ఇంటీరియర్ డిజైన్ రంగంలో పద్మజ సింగ్ అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పద్మజ సింగ్ మాట్లాడుతూ, ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసులు, హాస్పిటళ్లు, జువెల్లరీ షోరూమ్‌లు, ఫామ్ హౌస్‌లకు ప్రత్యేకంగా ఫర్నిచర్ డిజైన్ విభాగంలో ది లోటస్ స్టూడియో సేవలు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో మరిన్ని బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అవార్డు అందుకున్న సందర్భంగా రాజ్ సింగ్, గౌతమ్, మానస పద్మజ సింగ్‌కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.IMG-20251224-WA0090

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్