రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి

డాక్టర్ స్వరూపరాణి

రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి

వడ్డేపల్లి,డిసెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):

గొర్రెలు, మేకలకు ముందస్తుగా నట్టల నివారణ మందులు తప్పనిసరిగా తాగించుకోవాలని వడ్డేపల్లి మండల పశు వైద్య అధికారి డాక్టర్ స్వరూపరాణి తెలిపారు. పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వడ్డేపల్లి మండలంలోని కొంకల, వెంకట్రామనగర్, జిల్లేడుదిన్నెలో పశు వైద్య సిబ్బంది గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఇరవై రెండు మంది గొర్రెలు పెంపకందారులకు చెందిన మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేను జీవాలకు నట్టల నివారణ మందులు తాగించినట్లు తెలిపారు. ఇందులో మూడు వేల రెండు వందల యాభై ఐదు గొర్రెలు, నాలుగు వందల అరవై మేకలు ఉన్నాయని పేర్కొన్నారు. నట్టల నివారణ వల్ల జీవాలు త్వరగా బలంగా మారుతాయని, మాంసం పెరుగుతుందని, దీంతో రైతులకు ఆర్థిక లాభం చేకూరుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో వెంకట్రామనగర్ సర్పంచ్ వాసుగౌడ్, మాజీ ఉపసర్పంచ్ కుర్వ గొంగల్ల దేవేంద్ర పాల్గొన్నారు. అలాగే వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ పి. వర ప్రసాద్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ షేక్ లతీఫ్, ఓఎస్‌లు వెంకటమ్మ, కృష్ణ, రవి పాల్గొన్నారు. రైతులు ఇలాంటి ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్య సిబ్బంది సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్