బేతల్ గోస్పాల్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ ఉత్సవాలు

బేతల్ గోస్పాల్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ ఉత్సవాలు

ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బేతల్ గోస్పాల్ చర్చ్‌లో పాస్టర్ సురపనేని ప్రభు ప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా వేణుగోపాల చారి మాట్లాడుతూ, సర్వ మానవాళి పాపాలను కడగడానికి దేవుని రూపంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రేమ, క్షమ, త్యాగాలకు ప్రతీక అని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ సర్వ జీవులను ప్రేమతో చూడాలని ఆయన పిలుపునిచ్చారు.క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించగా, పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి.ఈ కార్యక్రమాల్లో సూరపనేని అనుప్, నాదెండ్ల భాస్కరరావు, శంకర్ రావు, అలాగే వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.క్రిస్మస్ ఉత్సవాలు ఆనందోత్సాహాలు, ఆధ్యాత్మిక సందేశాలతో విజయవంతంగా ముగిశాయి.IMG-20251225-WA0108

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .