మణిగిల్ల గ్రామంలో సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన చేపట్టిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

మార్నింగ్ వాక్ సందర్భంగా 10వ వార్డులో డ్రైనేజ్ సమస్యపై చర్చ

మణిగిల్ల గ్రామంలో సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన చేపట్టిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

పెద్దమందడి,డిసెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో నూతన గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఉదయం నిర్వహించిన మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా గ్రామంలోని 10వ వార్డులో తీవ్రంగా ఉన్న డ్రైనేజ్ సమస్యపై స్థానికులతో సర్పంచ్ చర్చించారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపై నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డు వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.దీనిపై స్పందించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని తెలిపారు. 10వ వార్డులో డ్రైనేజ్ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్న సర్పంచ్ ప్రయత్నాలు అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి వార్డులో ఇలాంటి పరిశీలనలు కొనసాగించి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంతో గ్రామస్తుల్లో నూతన గ్రామ పాలనపై నమ్మకం మరింత బలపడిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్