వెల్టూర్‌ గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ (చిట్టి) చారిత్రాత్మక విజయం 

బిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ (చిట్టి) 564 భారీ మెజారిటీతో గెలుపు 

వెల్టూర్‌ గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ (చిట్టి) చారిత్రాత్మక విజయం 

పెద్దమందడి,డిసెంబర్12(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్‌గా బిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ (చిట్టి) చారిత్రాత్మక విజయం సాధించారు. గ్రామ చరిత్రలో ఎన్నడూ రాని 564 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థులపై ఘన గెలుపు నమోదు చేస్తూ సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు.ఎన్నికల ప్రారంభం నుంచే గ్రామ ప్రజల మద్దతు అశోక్‌కు గట్టిగా లభించింది. గ్రామ అభివృద్ధి పట్ల చూపిన నిబద్ధత, ప్రజలతో నిశితంగా చేసిన మమేకం, ప్రతి ఇంటికి వెళ్లి చేసిన ప్రచారం ఈ విశేష విజయానికి కారణమైంది.ఎన్నిక ఫలితాలు వెలువడగానే వెల్టూర్ గ్రామం పండుగ వాతావరణం సంతరించుకుంది. అనుచరులు, గ్రామస్తులు డప్పులు మోగిస్తూ, పటాకులు పేలుస్తూ అశోక్‌ను ఘనంగా సన్మానించారు.గ్రామ చరిత్రలో ఇంత భారీ మెజారిటీతో వచ్చిన ఈ విజయం వెల్టూర్ అభివృద్ధికి నూతన దిశను చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ ప్రజల విశ్వాసానికి తగిన విధంగా సేవలు అందిస్తానని సర్పంచ్ అశోక్ సంకల్పం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .