బిఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సన్మానం..
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 12,(తెలంగాణ ముచ్చట్లు)
మొదటి విడత జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం నందు జరిగింది.
మండల అధ్యక్షులు వీరు నాయక్ మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ జె సి కృష్ణ,టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,జిల్లా మాజీ గ్రంధాలయం చైర్మన్ ఖమర్, నగర్ అధ్యక్షులు పగడాల నాగరాజు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు సన్మానం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసిన వెనకాడకుండా వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడి ఎన్నికైన 11 మంది సర్పంచ్ మరియు ఉప సర్పంచ్,వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు కోటపాడు కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మంచుకొండ తేజవత్ శంకర్,వేపకుంట్ల పొట్లపల్లి రమాదేవి, శివాయిగూడెం బానోతు సునీత,జీకే బంజర మాలోతు జ్యోతి,రాంఖ్యతండా గుగులోతు మూర్తి,బద్యతండా నునావత్ పెంట్యా,లచ్చిరాం తండా మాలోతు సుశీల, ఎన్ వి బంజర జర్పుల సౌందర్య,మూలగూడెం జర్పుల రవీందర్,కేవీ బంజర భూక్యా సరిత లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు హరిప్రసాద్,మెంటం రామారావు,చెరుకూరి ప్రదీప్,నాయకులు మందడపు నరసింహారావు,పొట్లపల్లి రాజా, తాత వెంకటేశ్వర్లు,లక్షణ్ నాయక్,ముతయ్య,వెంకట్,రామకృష్ణ,దేవా,తారచంద్,శ్రీను,రాంబాబు, సునీల్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments