సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు)
చిల్కానగర్ డివిజన్లోని సీతారామ కాలనీలో 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గురువారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ,“చిల్కానగర్ డివిజన్లో ఇప్పటి వరకు సుమారు 110 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. సీతారామ కాలనీలో ఇప్పటికే 95 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం” అని పేర్కొన్నారు.పనుల నాణ్యతపై అధికారులు, కాంట్రాక్టర్లకు ఆమె సూచనలు చేశారు.ఈకార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీతారామ కాలనీ అధ్యక్షులు గూడూరు రమేష్ గౌడ్, నాయకులు రామాంజనేయులు, అంజిరెడ్డి, నర్సిరెడ్డి, బల్లెం వేణుమాధవ్, నాగేశ్వరరావు, మధు, హరిబాబు, బంటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments