పోలింగ్ పై అవగాహన, అభ్యర్థులకు సూచనలు చేసిన పోలీసులు 

పోలింగ్ పై అవగాహన, అభ్యర్థులకు సూచనలు చేసిన పోలీసులు 

వేలేరు, 10 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేలేరు ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ధర్మసాగర్ సిఐ శ్రీధర్ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు సూచనలు చేశారు.ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఓటర్లను డబ్బులు, మద్యంతో ప్రలోభపెట్టే చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూడదని, సామాజిక మాధ్యమాలలో ఒకరిని మరొకరు కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు.

ఇలాంటి చర్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మిన లేదా పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా గ్రామస్థులు, అభ్యర్థులు అందరూ సహకరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .