ప్రతి ఓటరుకి కాంగ్రెస్ సంక్షేమం చేరాలి: జారె

ప్రతి ఓటరుకి కాంగ్రెస్ సంక్షేమం చేరాలి: జారె

అశ్వారావుపేట, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రంలో వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు సాధించాలంటే గ్రామస్థాయిలో కార్యాచరణ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు.

ములకలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోట దేవి ప్రసన్నతో కలిసి ఆయన పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపట్టిన సమీక్షలో జారె కీలక మార్గదర్శకాలు ఇచ్చారు.

జారె మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి కార్యకర్త ఓటరుని నేరుగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి అన్నారు. బూత్ స్థాయిలో సమన్వయం బలపడితేనే పోలింగ్ రోజు పనితీరు సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. గ్రామ సమస్యలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలో చేర్చాలని, ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. పార్టీ అంతర్గత ఐక్యతే విజయం దక్కించే కీలక అంశమని అన్నారు.

సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో పాటు అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరారు.IMG-20251127-WA0063

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!