జిహెచ్ఎంసి పునర్విభజనపై అభ్యంతరాలు కాప్రా ప్రజల డిమాండ్

జిహెచ్ఎంసి పునర్విభజనపై అభ్యంతరాలు కాప్రా ప్రజల డిమాండ్

కాప్రా, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు) :

నూతనంగా ప్రతిపాదించిన చక్రిపురం–16 డివిజన్ పేరును‘కుషాయిగూడ–16’గా మార్చాలని నాగార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చర్లపల్లి–3 డివిజన్‌ను రెండు భాగాలుగా విభజిస్తూ కొత్త డివిజన్‌కు చక్రిపురం–16 అని నిర్ణయించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దం చరిత్ర కలిగిన కుషాయిగూడ పేరు ప్రాంతీయ గుర్తింపు, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు.కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు యావపురం రవి, ప్రధాన కార్యదర్శి మొగిలి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీ‌ఓ తుల్జా సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. డివిజన్‌కు కుషాయిగూడ–16 అనే పేరునే నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, సహాయ కోశాధికారి సాయి వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .