రోశయ్య వర్ధంతి: 15వ బెటాలియన్‌లో ఘన నివాళి.

కమాండెంట్ పెద్దబాబు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పుష్పాంజలి.

రోశయ్య వర్ధంతి: 15వ బెటాలియన్‌లో ఘన నివాళి.

సత్తుపల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):IMG-20251204-WA0007

15వ బెటాలియన్ బి. గంగారం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమాన్ని కమాండెంట్ ఎన్‌. పెద్దబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. రోశయ్య ప్రజాసేవ, రాజకీయ జీవితం, పరిపాలనలో నిబద్ధతను స్మరిస్తూ హాజరైనవారు రెండు నిమిషాలు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేయాలన్న సందేశాన్ని రోశయ్య జీవితం అందిస్తుందని, ఆ విలువలను ఆచరణలో పెట్టాలని కమాండెంట్ పెద్దబాబు సిబ్బందిని కోరారు.

కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎ. అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు యస్‌. శ్రీధర్ రాజా, వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .