సి సి రోడ్ల పనులకు ప్రారంభోత్సవం ఎమ్మెల్యే బండారి

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

సి సి రోడ్ల పనులకు ప్రారంభోత్సవం ఎమ్మెల్యే బండారి

ఉప్పల్, డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం డివిజన్ పరిధిలో  రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. మొత్తం 35 లక్షల రూపాయల వ్యయంతో రెండు కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రవీంద్రనగర్ కాలనీలో చిన్న వర్షం వచ్చినా రోడ్డు పూర్తిగా జలమయమవుతుండటంతో, సమస్య పరిష్కారానికి 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అలాగే శ్రీ రాఘవేంద్రనగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద 100 మీటర్ల మేర రోడ్డు గుంతలమయం కావడంతో, సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో కొత్త సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, నాచారం డివిజన్ బారాస నాయకులు, కార్యకర్తలు, శ్రీ రాఘవేంద్రనగర్ కాలనీ వాసులు, కాంక్రీట్ పలాజో వాసులు, రవీంద్రనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .