జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

కాప్రా, డిసెంబర్‌ 13 (తెలంగాణ ముచ్చట్లు):

కాప్రా సర్కిల్‌ పరిధిలోని జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జమ్మిగడ్డ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జమ్మిగడ్డలో 20 వేలకుపైగా ఓటర్లు ఉండగా, దాదాపు 40 వేల మంది జనాభా నివసిస్తున్నప్పటికీ మౌలిక వసతులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.జనాభా పెరుగుదలతో పాటు అభివృద్ధి అవసరాలు అధికమయ్యాయని, ప్రత్యేక డివిజన్‌ హోదా కల్పిస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని దీక్షకారులు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యేక డివిజన్ అవసరమని పేర్కొన్నారు.ఈ రిలే నిరాహార దీక్షలో కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్‌ను వినిపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని వారు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .