జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

కాప్రా, డిసెంబర్‌ 13 (తెలంగాణ ముచ్చట్లు):

కాప్రా సర్కిల్‌ పరిధిలోని జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జమ్మిగడ్డ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జమ్మిగడ్డలో 20 వేలకుపైగా ఓటర్లు ఉండగా, దాదాపు 40 వేల మంది జనాభా నివసిస్తున్నప్పటికీ మౌలిక వసతులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.జనాభా పెరుగుదలతో పాటు అభివృద్ధి అవసరాలు అధికమయ్యాయని, ప్రత్యేక డివిజన్‌ హోదా కల్పిస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని దీక్షకారులు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యేక డివిజన్ అవసరమని పేర్కొన్నారు.ఈ రిలే నిరాహార దీక్షలో కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్‌ను వినిపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని వారు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!