మహిళా కార్మికులకు న్యాయబద్ధంగా వేతనాలు పెంచాలి

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

మహిళా కార్మికులకు న్యాయబద్ధంగా వేతనాలు పెంచాలి

నాచారం, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

మహిళా కార్మికులకు న్యాయబద్ధంగా వేతనాలు పెంచాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.వేతనాలు న్యాయంగా పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.శనివారం నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వద్ద మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని కోరుతూ నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.కార్మికుల పాలిట గుదిబండగా మారిన జీఓ నంబర్ 44ను వెంటనే సవరించి, వేతనాలు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మహిళా కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం, యాజమాన్యం గుర్తించి న్యాయం చేయాలని అన్నారు.ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ జీఎం మురళి మాట్లాడుతూ, వేతనాల పెంపు తమ పరిధిలో లేదని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. IMG-20251213-WA0062

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!