గ్రామంలో అభివృద్ధి చేశాం...మమ్మల్ని గెలిపించండి
Views: 44
On
వేలేరు, 10 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రఘనాయకుల కవిత శ్రీధర్ రెడ్డి ప్రజలతో ప్రచారంలో పాల్గొంటున్నారు.ప్రచార సందర్భంలో మాట్లాడుతూ...
“గతంలో ఉపసర్పంచ్గా ఉన్న సమయంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, శుభ్రత వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సర్పంచ్గా ముందడుగు వేస్తున్నాం. మీరు ఆదరించి, అధిక మెజారిటీతో గెలిపించాలి”
అని అన్నారు.ప్రచార కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments