ఎలిఫెంట్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
Views: 24
On
మల్లాపూర్,డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి “దీక్షా విజయ్ దివస్” వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ 2009లో స్వరాష్ట్రం కోసం 11రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన చారిత్రక విజయ దినాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మీర్పేట హౌసింగ్ బోర్డు డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జెన్ శేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments