హెచ్ఎంటి నగర్ లో కూలిపోయిన మ్యాన్‌హోల్‌ రిపేర్ పనులు ప్రారంభం

హెచ్ఎంటి నగర్ లో కూలిపోయిన మ్యాన్‌హోల్‌ రిపేర్ పనులు ప్రారంభం

నాచారం, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లోహెచ్ఎంటి నగర్ కాలనీకి జలమండలి వారు భారీగా మంచినీరు బల్క్ సప్లై అందించడంతో కాలనీలోని అనేక ప్రాంతాల్లో మురుగునీటి మ్యాన్ హోల్‌లు కూలిపోయినప్పటికీ వాటి మరమ్మతులపై జలమండలి నిర్లక్ష్యం చూపుతున్నారని స్థానికులు ఆరోపించారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,నాచారం కార్పొరేటర్  శాంతి సాయిజెన్ శేఖర్,  ప్రత్యేక చొరవతో ప్రస్తుతం మురుగునీటి పైప్‌లైన్ల శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి.హెచ్ఎంటి నగర్ వీధి నెంబర్ 7లో దీర్ఘకాలంగా కూలిపోయిన మ్యాన్ హోల్ కారణంగా వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో, కార్పొరేటర్ జలమండలి అధికారులతో మాట్లాడి కొత్త మ్యాన్ హోల్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాస్కర్, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ కిరణ్, బారాస నాయకులు సాయి జెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .