టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి వేణు గౌడ్కు ఘన సన్మానం
కీసర మండలం రిపోర్టర్ తుడుం బాలకృష్ణ
ఘట్కేసర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలాని కి చెందిన జి వేణు గౌడ్ ఇటీవల టీ డబ్ల్యూ జె ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా కీసర రిపోర్టర్ బాలకృష్ణ, సీనియర్ రిపోర్టర్ రజనీకాంత్ గౌడ్ ఘనంగా సన్మానించారు.అన్నోజిగూడలోని వేణు గౌడ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విలేకరుల సమక్షంలో ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా జి వేణు గౌడ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నిర్భయంగా వెలికి తీయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా, విలేకరుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూ, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఓటింగ్ హక్కు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కీసర రిపోర్టర్ బాలకృష్ణ, సీనియర్ రిపోర్టర్ రజనీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments