టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి వేణు గౌడ్‌కు ఘన సన్మానం

కీసర మండలం రిపోర్టర్ తుడుం బాలకృష్ణ

టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి వేణు గౌడ్‌కు ఘన సన్మానం

ఘట్‌కేసర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు): 

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలాని కి చెందిన జి వేణు గౌడ్ ఇటీవల టీ డబ్ల్యూ జె ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా కీసర రిపోర్టర్ బాలకృష్ణ, సీనియర్ రిపోర్టర్ రజనీకాంత్ గౌడ్ ఘనంగా సన్మానించారు.అన్నోజిగూడలోని వేణు గౌడ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విలేకరుల సమక్షంలో ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా జి వేణు గౌడ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నిర్భయంగా వెలికి తీయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా, విలేకరుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూ, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఓటింగ్ హక్కు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కీసర రిపోర్టర్ బాలకృష్ణ, సీనియర్ రిపోర్టర్ రజనీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.