ఆలోచించి ఓటు వేసి పనిచేసే వారిని సర్పంచ్ గా ఎన్నుకోండి.

 వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

ఆలోచించి ఓటు వేసి పనిచేసే వారిని సర్పంచ్ గా ఎన్నుకోండి.

 హసన్ పర్తి,డిసెంబర్10( తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని మడిపల్లి,అనంతసాగర్,జయగిరి,సితంపేట,పెంబర్తి, నాగారం,సీతా నాగారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.అభివృద్ధి,సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని అన్నారు. ఆలోచించి ఓటు వేసి పనిచేసేవారిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారికి ఓటు వేసి ఊరును బాగు చేసుకుంటారో వేరే వాళ్లకు ఓటు వేసి ఊరును ఆగం చేసుకుంటారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి,ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.IMG-20251210-WA0221

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .