వందనం గ్రామ సర్పంచ్ పీఠం మాదే
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగేశ్వరరావు
Views: 57
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో చివరి రోజు ప్రచారం హోరెత్తింది. వందనం గ్రామంలో సిపిఐ పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా మంత్రి తుమ్మల సహకారంతో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ప్రస్తుతం గ్రామ ప్రజలు అదే నమ్మకంతో మరోసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని సర్పంచ్ ఎన్నికల్లో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు మరోసారి సర్పంచ్ గా నాకు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వందనం గ్రామాన్ని అగ్రగామిగా నిలుపుతానని గ్రామంలో అన్ని రహదారులు సీసీ రహదారులుగా మారుస్తానని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments