చీర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభం
మేడ్చల్, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీర్యాల గ్రామంలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ పూజా కార్యక్రమం గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి, మాజీ ప్రజా ప్రతి నిధులు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి వజ్రేష్ యాదవ్ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను అధికారికంగా ప్రారంభించారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వజ్రేష్ యాదవ్ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం తమకు సొంతిల్లు కలగడానికి కారణమైందని పేర్కొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్లకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments