నాచారం డివిజన్ పునర్విభజనపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
నాచారం, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ హైదరాబాద్ను 300 డివిజన్లుగా పునర్విభజించిన నేపథ్యంలో నాచారం డివిజన్ను మెయిన్ రోడ్డును ఆధారంగా చేసుకొని రెండు కొత్త డివిజన్లుగా — హెచ్ఎంటి నగర్ మరియు నాచారం — విభజించారు. పాత నాచారం బౌండరీలతోనే హెచ్ఎంటి నగర్ డివిజన్ ఏర్పడినందున అక్కడ ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్థానిక నేతలు తెలిపారు.అయితే, పాత నాచారం డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని కాలనీలు తార్నాక డివిజన్లో పొందుపరిచినట్లు గుర్తించామని, ఆ కాలనీలన్నిటినీ తిరిగి నూతనంగా ఏర్పాటైన నాచారం డివిజన్కే చేర్చాలని జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన అభ్యంతరాల డెస్క్కు వినతిపత్రం సమర్పించినట్టు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ తెలిపారు.ఈ మేరకు ముందుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ను కలిసి సమస్యను వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి “నాచారం నుండి ఒక్క కాలనీ కూడా తార్నాకకు వెళ్లకుండా చూస్తాను” అని హామీ ఇచ్చినట్టు శేఖర్ తెలిపారు.


Comments