నాచారం డివిజన్ పునర్విభజనపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

నాచారం డివిజన్ పునర్విభజనపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

నాచారం, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రేటర్ హైదరాబాద్‌ను 300 డివిజన్లుగా పునర్విభజించిన నేపథ్యంలో నాచారం డివిజన్‌ను మెయిన్ రోడ్డును ఆధారంగా చేసుకొని రెండు కొత్త డివిజన్లుగా — హెచ్ఎంటి నగర్ మరియు నాచారం — విభజించారు. పాత నాచారం బౌండరీలతోనే హెచ్ఎంటి నగర్ డివిజన్ ఏర్పడినందున అక్కడ ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్థానిక నేతలు తెలిపారు.అయితే, పాత నాచారం డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని కాలనీలు తార్నాక డివిజన్‌లో పొందుపరిచినట్లు గుర్తించామని, ఆ కాలనీలన్నిటినీ తిరిగి నూతనంగా ఏర్పాటైన నాచారం డివిజన్‌కే చేర్చాలని జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన అభ్యంతరాల డెస్క్‌కు వినతిపత్రం సమర్పించినట్టు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ తెలిపారు.ఈ మేరకు ముందుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను కలిసి సమస్యను వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి “నాచారం నుండి ఒక్క కాలనీ కూడా తార్నాకకు వెళ్లకుండా చూస్తాను” అని హామీ ఇచ్చినట్టు శేఖర్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!