రుద్ర బెల్లం టీ స్టాల్ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లోని బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన రుద్ర బెల్లం టీ పాయింట్ ను జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, యువ పారిశ్రామికవేత్తలు సందీప్ మరియు కీర్తి రాజ్ తమ సొంతంగా టీ స్టాల్ ప్రారంభించడం నిజంగా అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి ద్వారా ఎదుగుతున్న యువత సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, ముద్దం శ్రీనివాస్ యాదవ్, మాస శేఖర్, చేర్యాల శ్రీనివాస్, ఫోటో బాలు, మహేష్, సాయిరాం, నరేష్, వేణు, రామ్ ప్రసాద్, కొట్టి శివ తదితరులు పాల్గొన్నారు.


Comments