మౌంట్ జియన్ మినిస్ట్రీస్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Views: 8
On
కాప్రా, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్ బి కాలనీ ఇంద్రానగర్ కాలనీ ఫేజ్–2 లోని మౌంట్ జియన్ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవ. కె. ఊర్మిళ ఆనంద్ ఏసుక్రీస్తు పవిత్ర జననం, ఆయన బోధించిన ప్రేమ, శాంతి, క్షమ అనే విలువలపై సందేశం అందించారు.ఈకార్యక్రమంలో చిన్నారులు క్రిస్మస్ పాటలతో దేవుణ్ని ఆరాధించగా, యువకులు నృత్యాలు, గీతాల ద్వారా తమ భక్తిని వ్యక్తం చేశారు. సంఘ సభ్యులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరాధనలో భాగమయ్యారు.ఆరాధన అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Dec 2025 17:42:39
ఘట్కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ సర్కిల్కు నూతన డిప్యూటీ కమిషనర్గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...


Comments