మణిగిల్ల గ్రామంలో పైప్‌లైన్ లీకేజీకి తక్షణ చర్యలు

గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ 

మణిగిల్ల గ్రామంలో పైప్‌లైన్ లీకేజీకి తక్షణ చర్యలు

పెద్దమందడి,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని వెంకన్న చెరువు వెనుక ఉన్న మంచినీటి బోరు పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ సమస్యను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పరిశీలించారు. సమస్య తీవ్రతను గమనించిన వెంటనే సంబంధిత సిబ్బందితో మాట్లాడి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం గ్రామపంచాయతీ ప్రధాన బాధ్యత అని అన్నారు.తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీటి వృథా జరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు.సర్పంచ్ ఆదేశాల మేరకు పైప్‌లైన్ మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించగా, త్వరలోనే పనులు పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని సంబంధిత సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సుంచర మోని రాములు, మద్దిరాల రామ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బోయిన్ కృష్ణ, ప్రేమ్ కుమార్, గణేష్, గొల్ల సోమయ్య, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొని సహకరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్