మణిగిల్ల గ్రామంలో పైప్‌లైన్ లీకేజీకి తక్షణ చర్యలు

గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ 

మణిగిల్ల గ్రామంలో పైప్‌లైన్ లీకేజీకి తక్షణ చర్యలు

పెద్దమందడి,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని వెంకన్న చెరువు వెనుక ఉన్న మంచినీటి బోరు పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ సమస్యను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పరిశీలించారు. సమస్య తీవ్రతను గమనించిన వెంటనే సంబంధిత సిబ్బందితో మాట్లాడి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం గ్రామపంచాయతీ ప్రధాన బాధ్యత అని అన్నారు.తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీటి వృథా జరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు.సర్పంచ్ ఆదేశాల మేరకు పైప్‌లైన్ మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించగా, త్వరలోనే పనులు పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని సంబంధిత సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సుంచర మోని రాములు, మద్దిరాల రామ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బోయిన్ కృష్ణ, ప్రేమ్ కుమార్, గణేష్, గొల్ల సోమయ్య, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొని సహకరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .