ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా

దారం చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డ యువకుడు

ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా

 కీసర , డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా మరోసారి ప్రమాదానికి కారణమైంది.  కీసర గ్రామం మల్లికార్జున నగర్ కాలనీలో నివాసం ఉంటున్న జశ్వంత్ రెడ్డి అనే యువకుడు చైనా మాంజా దారంతో తీవ్రంగా గాయపడ్డాడు.శుక్రవారం జరిగిన ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా చైనా మాంజా దారం జశ్వంత్ రెడ్డి మెడకు చుట్టుకోవడంతో మెడ తీవ్రంగా కోసుకుపోయింది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని నితిన్ హాస్పిటల్ కు తరలించారు.ప్రస్తుతం జశ్వంత్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ, చైనా మాంజా విక్రయాలు మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.చైనా మాంజా వల్ల ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిముఖ్యంగా యువత ఈ ప్రమాదకర మాంజాను ఉపయోగించవద్దని స్థానికులు కోరుతున్నారు.IMG-20251226-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్