ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలు

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలు

ధర్మసాగర్,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన పాలనా దార్శనికత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో వాజ్‌పేయి చేసిన కృషిని వారు గుర్తు చేశారు.
ఈ వేడుకల్లో పెసరు వెంకటేష్, ననుబాల కుమారస్వామి, హరిష్, వెంకటేష్, శివ, బిక్షపతి, సర్వేశ్, ప్రసాద్, వెంకటస్వామి, రాజు, రాజు, రాకేష్, సంజీవ్, మహేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.IMG-20251225-WA0143

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్